దేశ వ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మిపూజలు చేస్తూ, పటాకులు కాలుస్తూ ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. గుజరాత్ లోని అక్షరధామ్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. గౌహతి, బెంగళూరు, ముంబై, వారణాసిలో ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాకుల దుకాణాలు, స్వీట్ షాపులు, ఆలయాలు జనంతో కళకళలాడుతున్నాయి. పార్లమెంట్ భవనంతో పాటు గోల్డెన్ టెంపుల్ తదితర ఆలయాలు దీపాల వెలుగులో కళకళలాడుతున్నాయి. వారణాసిలో సాధువులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రజలంతా దీపావళి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.