ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చిన సమయంలో....నేను సాయం చేస్తా అన్న వద్దు అన్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2017, 12:53 PM

దార్‌నాథ్: చార్‌ధామ్‌లో ఒకటైన కేదార్‌నాథ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. 2013లో ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను సాయం చేస్తానని చెప్పినా.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేదంటూ తిరస్కరించిందని వెల్లడించారు. కాంగ్రెస్ అభద్రతాభావమే దీనికి కారణమని మోదీ అన్నారు. భారత్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సమయం వరకు తన లక్ష్యాలను సాధిస్తానని స్పష్టంచేశారు. అంతకుముందు కేదార్‌నాథ్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగేళ్ల కిందట వరదలు వచ్చిన సమయంలో తాను ఇక్కడికి వచ్చానని, బాధితులకు సాయం చేస్తానని చెప్పినా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని మోదీ అన్నారు. అందుకే ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజలు కాంగ్రెస్‌ను కాదని బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు.


అసలుసిసలు తీర్థ క్షేత్రం అంటే ఎలా ఉంటుందో అలా కేదార్‌నాథ్‌ను తీర్చిదిద్దుతామని మోదీ స్పష్టంచేశారు. కేదార్‌నాథ్‌లో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నామని, అయితే అవన్నీ సాంప్రదాయ రీతిలోనే ఉంటాయని మోదీ చెప్పారు. ఇక్కడి పర్యావరణానికి ఎలాంటి హాని జరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవాటు చేసుకొని, అదే రీతిలో ఇక్కడి పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. హిమాలయాల్లో ఆధ్యాత్మికత ఉంది. ప్రకృతి ప్రేమికులు కోరుకునే వాతావరణం ఉంది. అడ్వెంచర్ చేయాలనుకువాళ్లకు అవకాశం కల్పిస్తుంది. వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి హిమాలయాలను ఆస్వాదించండి అని మోదీ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com