ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా పైసా పైసా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధర మరోసారి చాలా స్వల్పంగా తగ్గింది. ఆదివారం చాలా స్వల్పంగా తగ్గిన డీజిల్ ధర సోమవారం మళ్లీ పెరిగింది. ఆదివారంతో పోలిస్తే నేడు (నవంబర్ 20న) లీటర్ పెట్రోల్ ధరపై 3 పైసల వరకు తగ్గింది. ఇక డీజిల్ ధర 3 పైసల వరకు పెరిగింది. నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.68 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 63.45గా ఉంది. ఇక ఆంధ్ర రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.50గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.65.44గా ఉంది.