తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ఏపీలోని పుట్టపర్తి పర్యటనలో ఉన్నారు. ఆయన ఇవాళ ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఇవాళ అంతర్జాతీయ వేద సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 15 వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.