హైదరాబాద్ : నగరంలోని చిక్కడపల్లి, ముషీరాబాద్, నారాయణగూడ ప్రాంతాల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి లైబ్రరీని కేటీఆర్ పరిశీలించారు. లైబ్రరీ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఆధునిక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పుతామని మంత్రి తెలిపారు. ఉద్యోగాల భర్తీ పట్ల నిరుద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. హామీప్రకారం 1.12 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడుతామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.