సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం బొర్గీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో వెళ్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సర్దార్ తండా నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.