ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కదులుతున్న రైలులో ముస్లిం మత పెద్దలపై దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2017, 03:29 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బాఘ్‌పాట్‌ జిల్లాలో కదులుతున్న రైలులో ముగ్గురు ముస్లిం మత పెద్దలపై కొందరు దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఢిల్లిలోని మర్కజి మసీదును సందర్శించి వస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగింది. బాఘ్‌పాట్‌ జిల్లాలోని అహెడా గ్రామానికి చెందిన ముగ్గురు మత పెద్దలు అహెడా రైల్వే స్టేషన్‌ సమీపిస్తుండటంతో రైలు దిగడానికి సిద్ధమయ్యారు. వారి తలలపై రుమాళ్లు చుట్టుకున్నారు. కాగా తలలపై ఎందుకు రుమాళ్లు చుట్టుకున్నారంటూ దుండగులు వారిపై దాడి చేశారు. వారిని రైల్లోంచి బైటికి తోసేయడానికి ప్రయత్నించారు. తమపై దాడి చేసిన వారెవరో తమకు తెలియదని, అయితే వారిని గుర్తించగలమని బాధితులు చెప్పారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com