బీసీసీఐపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫైరయ్యాడు. రెస్ట్ లేకుండా సిరీస్ లను నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాగపూర్ లో మీడియాతో మాట్లాడిన కోహ్లీ బీసీసీఐకు ఏమాత్రం ప్లానింగ్ లేదని, గత్యంతరం లేకనే ఆడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీలంక సిరీస్ తర్వాత గ్యాప్ లేకుండా సౌతాఫ్రికాకు వెళ్తున్నామని, ఇలా రెస్ట్ లేకుండా ఆడటం .. ఇండియా క్రికెట్ కు మంచిది కాదని అన్నాడు. బీసీసీఐ ప్లేయర్ల కోణంలోనూ ఆలోచించాలని కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. ఇక రేపటి నుంచి భారత్ , శ్రీలంక మధ్య నాగ్ పూర్ లో సెకండ్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.