విశాఖ : ఎయిర్ ఏసియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఏసియా విమానం సాంకేతిక లోపంతో ఆలస్యమైంది. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికుల్లో 23 మంది అయ్యప్ప భక్తులున్నారు. మధ్యాహ్నం 3గంటలకు అయ్యప్ప భక్తులు బెంగళూరు నుంచి కోచి వెళ్లాల్సి ఉంది. ఎయిర్ పోర్టు డైరెక్టర్ ప్రయాణికులతో సర్దిచెప్పారు.