హైదరాబాద్: హైదరాబాద్ కు తలమానికంగా నిలిచే మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 20 కిలోమీటర్ల మెట్రో పనులు కూడా చేయలేదని తలసాని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అని పనులు పూర్తవుతున్నాయని తలసాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేరని తలసాని అన్నారు.