మహబూబ్నగర్ జిల్లాలోని కోస్గి మండలం నాగసానిపల్లిలో బీటీ రోడ్డు పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లిని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని జూపల్లి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డు పడుతున్నాయని మంత్రి ధ్వజమెత్తారు.