ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్కొండ కోటలో విందు.. జీఈఎస్ అతిథులు పసందు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2017, 08:09 AM

గోల్కొండ కోటలో జీఈఎస్ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విందు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితరులు సహా 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులంతా 45 మినీ బస్సుల్లో గోల్కొండ కోటకు చేరుకున్నారు. విందు నేపథ్యంలో కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.


గోల్కొండ కోట అందాలకు విదేశీ ప్రతినిధులు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విదేశీ ప్రతినిధులు గుస్సాడీ కళాకారులతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. ఉత్సాహంగా గడిపారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు ఇవాంక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రతా వలయం మధ్య ఆమె ఈ చారిత్రక కోటకు చేరుకున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో భద్రతాధికారులతో పాటు స్థానిక పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కోట చారిత్రక నేపథ్యం, ప్రాశస్త్యాన్ని పర్యాటక శాఖ అధికారులు ఇవాంకకు వివరించారు. అనంతరం ఆమె కోటలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు ఇవాంక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రతా వలయం మధ్య ఆమె ఈ చారిత్రక కోటకు చేరుకున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో భద్రతాధికారులతో పాటు స్థానిక పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కోట చారిత్రక నేపథ్యం, ప్రాశస్త్యాన్ని పర్యాటక శాఖ అధికారులు ఇవాంకకు వివరించారు. అనంతరం ఆమె కోటలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com