తివల ఆత్మబలాన్ని చాటిచెప్పేందుకుగాను ఆరుగురు భారత ధీరవనితలు తలపెట్టిన సాహసయాత్ర ‘నావికా సాగర్ పరిక్రమ’ న్యూజిలాండ్ చేరింది. ‘ఐఎన్ఎస్వీ తరిణి’ నౌకపై న్యూజిలాండ్లోని లిటెల్టన్ ఓడరేవును వారు బుధవారం చేరుకున్నారు. లెఫ్టినెంట్ కమాండర్ వర్తికాజోషి నేతృత్వంలో లెఫ్టినెంట్ కమాండర్లు ప్రతిభా జమ్వాల్, పి.స్వాతి, లెఫ్టినెంట్లు ఎస్.విజయదేవి, బి.ఐశ్వర్య, పాయల్గుప్తా ఈ సాహసయాత్రలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న ప్రారంభమైన వీరి యాత్ర ఇప్పటివరకు 7,800 నాటికల్ మైళ్లు సాగింది. ఫ్రెమాంటిల్(ఆస్ట్రేలియా), లిటెల్టన్(న్యూజిలాండ్), పోర్ట్స్టాన్లీ(ఫాక్ల్యాండ్స్), కేప్టౌన్(దక్షిణాఫ్రికా) ఓడరేవుల్లో మాత్రమే వారు ఆగుతారు. వచ్చేనెల 12న ‘ఐఎన్ఎస్వీ తరిణి’ న్యూజిలాండ్ నుంచి బయలుదేరుతుంది. మరో రెండు ఓడరేవుల్లో ఆగిన అనంతరం 2018ఏప్రిల్లో తిరిగి గోవా చేరుకుంటుంది. సాహసయాత్రలో భాగంగా ఈ బృందం వాతావరణ పరిస్థితులు, సముద్ర అలలకు సంబంధించిన సమాచారాన్ని భారత వాతావరణశాఖ(ఐఎండీ)కి ఎప్పటికప్పుడు చేరవేస్తోంది.