ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం 2018 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. దేవస్థానం పేరుమీద ముద్రించిన క్యాలెండర్లను ఎంపీ వినోద్, ఎమ్మెల్యే రమేష్బాబు, ఆలయ ఈఓ దూస రాజేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న ఆలయ విశిష్టతను తెలిపేవిధంగా క్యాలెండర్లు ముద్రించడం హర్షనీయమని, ప్రతి ఒక్కరికి ఈ క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతామన్నారు.