జగిత్యాల జిల్లాలోని ధరూర్ క్యాంపులో టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ డైట్ కాలేజీకి కవిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా కలెక్టర్ శరత్, టీఆర్ఎస్ నేతలతో పాటు తదితరులు పాల్గొన్నారు.