కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నరాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికల హడావుడి నెలకొంది. నామినేషన్ కు చివరి రోజు కావడంతో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్నిసోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లు ప్రతిపాదించారు. ఒక్కో సెట్ పై 10మంది పీసీసీ ప్రతినిధులు సంతకాలు చేశారు. నెహ్రూ కుటుంబంలో ఆరో వ్యక్తిగా రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు అందుకోనున్నారు. రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమేనని తెలుస్తోంది.