మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.