ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2017, 09:47 AM

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో కరీంనగర్‌ చేరుకోనున్నారు. రాత్రి కరీంనగర్‌లోనే సీఎం బస చేసి రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. సర్వే తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి రామగుండం వెళ్లనున్నారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిపై కేసీఆర్‌ సమీక్షించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com