హైదరాబాద్:బీసీ సమస్యలపై ప్రభుత్వం చర్చిస్తుంటే కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్లో ఏసీల కింద కూర్చొని బీసీల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. 113 బీసీల కులాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, అర్థిక పరిపుష్టం చేయాలని మూడు రోజులుగా బీసీ సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుందని, ప్రభుత్వ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారన్నారు.