ముంబై: కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత వార్షిక సంవత్సర మూడవ, నాలుగవ క్వార్టర్లో ద్రవ్యోల్బణం రేటు 4.3 నుంచి 4.7 శాతానికి పెరగనున్నట్లు ఆర్బీఐ పేర్కొన్నది. ఆరుగురు సభ్యులు మానిటరీ పాలసీ కమిటీ ఈ విషయాన్ని నిర్ధారించింది. పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పటేల్ తెలిపారు. డిస్కౌంట్ రేట్లను తగ్గించాలన్న అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక ప్రగతి 6.7 శాతమే వద్దే ఉండనున్నట్లు ఆయన చెప్పారు.