అహ్మదాబాద్ : అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో హిందువుల విశ్వాసాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటున్నదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2019లో సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత రామ్జన్మభూమి-బాబ్రీ మసీదు కేసును విచారించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు విన్నవించడంపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ అది హిందువుల విశ్వాసాలతో కాంగ్రెస్ ఆడుకోవడమేనని అన్నారు.