ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లికి బయల్దేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏరియల్ సర్వే చేపట్టిన కేసీఆర్ ఇప్పటికే తుపాకులగూడెం బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించారు. బ్యారేజీ నిర్మాణ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కన్నెపల్లి పంప్హౌస్ సందర్శన కోసం మేడిగడ్డ నుంచి సీఎం బయల్దేరారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్రావు, ఈటెల, అధికారులు ఉన్నారు.