ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్. దర్శకుడిగానే కాదు నిర్మాతగాను ఆయన రాణిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన కారుకి ప్రమాదం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో షోలుంగనూర్ సిగ్నల్ వద్ద ఉదయం 3.30 గంటలకు ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్లో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. కారులో ప్రయాణిస్తున్న గౌతమ్తో పాటు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గౌతమ్ మీనన్ను దగ్గర్లోని హాస్పటల్కు తరలించారు.లారీ డ్రైవర్ తప్పిదం వలనే ఇది జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గౌతమ్ మీనన్ తమిళంలో ధ్రువ నక్షత్రం, ఒండ్రగా లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.