హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు ఎలాంటి వాయిదా లేకుండా యధాతథంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్లుగా ఈ నెల 14వ తేదీ నుంచి అన్ని డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, దానిని విద్యార్థులు నమ్మవద్దని చెప్పారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. విద్యార్థులు వివరాలకు ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని పేర్కొన్నారు.