పెద్దపల్లి: ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం నుంచి బయలుదేరారు. కాసేపట్లో మేడారం పంపుహౌస్కు సీఎం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మేడారం 6వ ప్యాకేజీ పంపుహౌజ్ పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12:20 గంటలకు రామడుగు మండలం లక్ష్మీపూర్ చేరుకోనున్నారు. అక్కడ కాళేశ్వరం గ్రావిటీ కాల్వ సొరంగం పనులను సీఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం రామడుగులో భోజన విరామం, తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్కు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం గంటల వరకు రాంపూర్ పంప్హౌస్ పనులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3:45 గంటల వరకు మిడ్ మానేరు ప్రాజెక్టు పనుల పరిశీలన చేయనున్నారు. అనంతరం హైదరాబాద్కు సీఎం బయలుదేరుతారు.