వైకాపా అధినేత జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఎదుట నేడు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర పేర నిర్వహిస్తున్న పాదయాత్రలో ఉన్న జగన్ నిన్న సాయంత్రం యాత్ర ముగించిన అనంతరం హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఈ రోజు కోర్టులో హాజరైన అనంతరం రేపటి నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తారు.