తిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మెన్ బాల మల్లు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామసమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్దం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేదాశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని టిఎస్ఐఐసి చైర్మెన్ బాల మల్లు తెలిపారు.