రంగారెడ్డి : ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రతిపక్షాలు అధికారం కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొలువుల పేరిట యువతను రెచ్చగొట్టొదని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు అతిగతి లేకనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఆగస్టు నాటికి లక్షా ఉద్యోగాలకు పైగా భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బీసీ విప్లవం రానుందని తలసాని తెలిపారు. ఒక్క రోజు మొత్తం బీసీల కోసమే అసెంబ్లీ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు.