బరూచ్ : గుజరాత్ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరూచ్లోని అంక్లేశ్వర్లోని ఓ పోలింగ్ బూత్లో పటేల్ ఓటేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 110 స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.