యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ధర్మదర్శనం క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వాహనాలను కొండ కిందనే ఫార్కింగ్ చేయిస్తున్నారు. నరసింహస్వామిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దర్శించుకున్నారు. స్వామివారి పల్లకి సేవలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.