నల్గొండ: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు నాగార్జునసాగర్ చేరుకున్నారు. మరికాసేపట్లో మంత్రి హరీశ్రావు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొననున్నారు. నీటి విడుదల అనంతరం ఏఎంఆర్ ప్రాజెక్టు, ఉదయసముద్రం పనులపై మంత్రి హరీశ్రావు సమీక్షించనున్నారు.