మెదక్ : ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమంలో భాగంగా మెదక్ లో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. బతుకమ్మలను ఎత్తుకొని, సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ సందడిగా కొనసాగింది. ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.