శామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం స్కూల్ పిల్లలతో హైదరాబాద్కు వస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పిల్లలకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విహారయాత్ర కోసం హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.