యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ యాదాద్రి పర్యటనలో ఉన్న ఆయన స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రిలో శివాలయం విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విప్ గొంగిడి సునిత, కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.