ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 08:42 AM

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి తిరిగి 20న డిల్లీకి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి రెండురోజుల పర్యటనకు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో భద్రత, వసతి ఏర్పాట్ల కోసం మంగళవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నేతృత్వంలో సమన్వయ సమావేశం జరుగనున్నది. ఈ మేరకు సంబంధితశాఖల అధికారులు హాజరుకావాలని సమాచారం పంపించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి వస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 19వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళతారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com