ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో.. జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్, ఉట్నూరు ఏజెన్సీ, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి పెరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఇక్కడ చలి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. చలి గాలులతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందన్నారు.