అదిలాబాద్ః జిల్లా ప్రజలకు చలి చుక్కలు చూపిస్తుంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతుండటంతో జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగింది. చలి తీవ్రత కనిష్ఠగా 6.1 డిగ్రీలుగా ఉంది. ఆదిలాబాద్, ఉట్నూరు ఏజెన్సీ, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి మరింత పెరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఇక్కడ చలి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ వీస్తున్న చలి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.