ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కివీస్ చేతిలో విండీస్ వైట్‌వాష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 02:48 PM

న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో టెస్టు సిరీస్‌లో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. మంగళవారం హామిల్టన్‌ వేదికగా ముగిసిన రెండో టెస్టులో 444 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన విండీస్ 203 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 240 పరుగుల భారీ తేడాతో గెలిచిన కివీస్‌ రెండు టెస్టుల ఈ సిరీస్‌ని 2-0తో క్లీన్‌స్వీస్ చేసేసింది. రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్‌కి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 373 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 152 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ 291/8 వద్ద డిక్లేర్ చేసి 444 పరుగుల భారీ లక్ష్యాన్ని కరీబియన్ల ముందు ఉంచింది. ఛేదనలో విండీస్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ డిసెంబరు 20న జరగనుంద










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com