ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మెకు ఎఐటియుసి మద్దతు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 09:12 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రయివేటీకరించే దిశగా కేం ద్ర చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేప ట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.నరసింహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెలికాం రంగంలో ఉన్న ప్రయివేటు టెలికాం ఆపరేటర్లు రిల యన్స్‌, ఎయిర్‌టెల్‌, ఐడియా తదితర కార్పొరేట్‌ సం స్థల ఒత్తిడి మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధీనంలో దేశవ్యా ప్తంగా సుమారు 700పైగా ఉన్న టవర్లను బీఎస్‌ఎ న్‌ఎల్‌ నుండి విడదీసి ఒక ప్రయివేటు సంస్థగా ఏర్పాటు చేసి దాన్ని నష్టాల ఊబిలోకి నెట్టి చివరికి ఆ సంస్థను ప్రయివేటుకు అప్పగించే కుట్రలో భా గంగా కేంద్రంలో మోడీ సర్కార్‌ పావులు కదుపు తు న్నదని ఆరోపించారు. ఇప్పటికే మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌లో వాటాలు విక్రయించి ఆ సంస్థ ను కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్పే చర్యలు చేపట్టిం దని ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ను కూడా ప్రయివేటీక రించేందుకు నిర్ణయించిందని విమర్శించారు. దీనిని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, అధికారుల సంఘాల జేఏసీ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎ ల్‌ను వందశాతం పబ్లిక్‌ రంగ సంస్థగానే ఉంచాల ని, 3వ వేతన సవరణను 2007 నుంచి అమలు పరచాలని, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాపితంగా ఉద్యోగులు సమ్మె చేపట్టారని తెలిపారు. ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com