ఈ నెల 15 నుండి 19 వరకు హైదరాబాద్లో జరిగే ప్రపంప తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చే జిల్లా వాసులకు ఆర్టిసి బస్సు సౌకర్యా న్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ జిల్లా కలెక్టర్లను అదేశించారు. మంగళ వారం సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభ లకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సాహిత్యంపై మక్కువ ఉన్న అభిమానులు ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న మహోన్నత లక్షంతో ప్రపంచ తెలుగు సహాసభలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మహాసభలను నిర్వహించాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కె.చంధ్రశేఖర్రావు ఉన్నారని, ఈ నెల 15వ తేదిన ఉప రాష్ట్రపతి ఎం.వెంకటయ్య నాయుడు ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభి స్తారని సూచించారు. 19న తెలుగు మహా సభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొం టారని, గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సిఎం కెసిఆర్ పాల్గొంటారన్నారు. ముగింపు వేడుకలకు జిల్లాలోని సాహిత్యంపై మక్కువ ఉన్న వారు పాల్గొనేందుకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాజకొంద పోలీస్ కమీష నర్లు సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లాల నుండి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియ మించుకోవాలన్నారు. విద్యాశాఖాధికారి, రవాణా, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలన్నారు.
జిల్లాలోని జడ్పిచైర్మన్, డిసిసిబి చైర్మన్, మార్కెట్ కమి టీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లకు అహ్వాన పత్రాలను పంపించాలన్నారు. క్రి స్మస్ పురస్కరించుకొని గిప్టు ప్యాకులను జి ల్లాలకు పంపించామని, శాసనసభ్యులను సంప్రదించి చర్చీలలో ఈనెల 14న దుస్తు లు పంషిణీ చేసి 18న విందును నిర్వహిం చాలని మైనారిటీ కార్యదర్శి ఓమర్ జలీల్ జిలా కలెక్టర్లను కోరారు. నోడల్ అధికారు లను నియమించుకొని కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రికార్డుల అప్డెషన్ కు సంబంధించి రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టారు.