మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండవ వన్డేలో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నది. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఇండియా దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. రెండవ వన్డేకు ఇండియన్ టీమ్లో ఒక మార్పు చేశారు. కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన సుందర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. అతను స్పిన్నర్ కూడా. ఇండియా తరపున అరంగేట్రం చేసిన ఏడవ యువ ప్లేయర్గా వాషింగ్టన్ నిలిచాడు.