రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఇవాళ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా షాద్ నగర్ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం, కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులకు చార్జ్ మెమో జారీ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే అంజయ్య, పలువురు ప్రజాప్రతినిధులున్నారు.