ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జల విజయయాత్ర పాల్గొన్న మంత్రులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 05:07 PM

నాగర్‌కర్నూల్: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రైతులకు వరప్రదాయినిగా మారింది. రెండేళ్ల నుంచి ఎంజీకేఎల్‌ఐ ద్వారా జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేటతో పాటుగా ఇటీవలే కల్వకుర్తి నియోజకవర్గంతో కలిపి దాదాపుగా 2 లక్షల ఎకరాలకు పైగా భూమిలో వరి, వేరుశనగ తదితర పంటలు పండుతూ రైతుల ఇళ్లల్లో సిరులు నింపుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తికి చేసిన కృషిని వివరించేందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముందుకు కదిలారు. జల యాత్ర పేరిట వారం రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ జలయాత్ర తెలకపల్లి మండలం లక్నారంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్నారావు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ నెల 18న నేరెళ్లపల్లిలో జలయాత్ర ముగియనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com