హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం సఃంభవించింది. ఈ ప్రమాదంలో మార్కెట్ లోని చిరు వ్యాపారుల దుకాణాలు తగులబడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ లో తరుచు దొంగతనాలు, అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నుండి రక్షణ కల్పించాలని వ్యాపారులు వేడుకుంటున్నారు. మార్కెట్ యార్డును స్దానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిశీలించారు.