ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులకి 30 వరకు గడువు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 08:48 AM

హైదరాబాద్ : ఆస్తిపన్నులు, ట్రేడ్ లైసెన్సు ఫీజులు 30వ తేదీలోపు చెల్లించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో జనవరి 1 నుంచి రెండుశాతం అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ద్వితీయ అర్థ సంవత్సర పన్ను డిసెంబర్ చివరి నాటికి చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ చివరి రోజు ఆదివారం కావడంతో 30లోగా చెల్లించాలని కోరుతున్నారు. ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యం రూ. 1400 కోట్లు కాగా, ప్రస్తుతానికి రూ. 736.66 కోట్లు వసూలైనట్లు, అలాగే ట్రేడ్ లైసెన్సు ఫీజులు రూ. 50 కోట్లు లక్ష్యం కాగా, రూ. 72 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. పన్నుల వసూళ్లలో వెనకబడ్డ సర్కిళ్లకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com