హైదరాబాద్: ఏడో ఐకాన్ ఎస్డబ్ల్యూఎం(సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) 2017 అంతర్జాతీయ సదస్సు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఐకాన్ ఎస్డబ్ల్యుఎం ఛైర్మన్ ప్రొఫెసర్. సదన్ కే ఘోష్ తెలిపారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ అండ్ వాటర్(ఐఎస్డబ్ల్యూంఏడబ్ల్యూ, యూఎన్సీఆర్డీ, టీఎస్పీసీబీ, జీహెచ్ఎంసీ, ఎఫ్టీఏపీసీఐ, పీజేటీఎస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర సంస్థల సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. సదస్సులో ప్రధానంగా ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్సిటీలు, ప్రాసెసింగ్ ఆఫ్ వేస్ట్, వ్యర్థ జలాల శుద్ధి, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్యలు ఉంటాయన్నారు. మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన 260 మంది ప్రతినిధుల ఉపన్యాసాలు, బృంద చర్చలు ఉంటాయన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పరిశ్రమలు, విద్యా, పరిశోధన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.