హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో మహాసభల ఏర్పాట్లను హోంమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఈ సభలో రాష్ట్ర గీతంను అధికారికంగా ప్రకటించే అంశంపై సీఎం ఆలోచన చేస్తున్నారని తెలిపారు.