హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ నిప్పులు చెరిగారు. పంజాబ్లో గెలిచినట్లు తెలంగాణలో గెలుస్తామనుకోవడం కాంగ్రెస్ భ్రమ అని విమర్శించారు. 2019 కాదు.. 2024లో కూడా కాంగ్రెస్ గెలవదు అని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి మతి లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. గిరిజనులకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని రాముల్ నాయక్ పేర్కొన్నారు.