సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై వార్తల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ స్పందించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాలనుంచి వెంటనే వైదొలగడం లేదని చెప్పారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ కు అప్పగిస్తున్నారంతేనని పేర్కొన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.