ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు ప్రత్యేకరైలు ఏర్పాటు చేయండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2017, 09:19 AM

హైదరాబాద్ : అయ్యప్ప భక్తుల కోసం నిజమాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలును నడిపించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు లేఖరాశారు. వచ్చే నెల జనవరి 11న నిజామాబాద్ నుంచి శబరిమలకు.. జనవరి 16 వ తేదీన శబరిమల నుంచి నిజామాబాద్‌కు ప్రత్యేక రైలు నడిపించాలని కోరారు. నిజామాబాద్ నుంచి వేలాది మంది అయ్యప్పభక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు శబరిమలకు వెళతారని చెప్పారు. వీరి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com